Sunday, February 23, 2025

అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు 11మంది మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రులు వారి శాఖకు సంబంధించిన బాధ్యతలను చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టి సంబందిత అధికారులతో రివ్యూలు కూడా నిర్వహించి సమాచారం తెలుసుకుంటున్నారు.

ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News