Saturday, September 28, 2024

తెలంగాణలోనూ మోడీ గాలి వీచింది:కొండా విశ్వేశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోనూ మోడీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పని చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కెసిఆర్ తెలంగాణాను అప్పులకుప్పగా మార్చారని అందుకే ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాలేదని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయడం వల్లే చేవెళ్లలో విజయం సాధించామని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని,

రాజ్యాంగాన్ని మారుస్తారని తప్పుడు ప్రచారం చేశారని అయితే వాటిని నమ్మకుండా ప్రజలు బిజెపికే ఓట్లు వేశారని తెలిపారు. భవిష్యత్తు ఎన్నికల్లోనూ మద్యం, డబ్బులు లేని ఎన్నికలు జరగాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇదే ఊపుతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పని చేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, నిధులు తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. దేశంలోనే ఆదర్శ ఎంపీగా నిలిచేలా నడుచుకుంటానని తెలిపారు. అధిష్ఠానం ఏ అవకాశం ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. మెదక్‌లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా బిఆర్‌ఎస్ గెలవలేదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News