Tuesday, September 17, 2024

వసీం ఆత్మహత్యకు కారణమెవరు..?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్యకు పాల్పడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. వసీం బలవన్మరణానికి కారణమెవరు..?అని ప్రశ్నించారు. కాగా, కెటిఆర్ ట్వీట్ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ స్పందించారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. బకాయిలో ఉన్న ఒక నెల వేతనం చెల్లించడానికి ప్రాసెస్‌లో ఉందని, పూర్తి వివరాలు తెలుసుకుని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తే బాగుంటుందని సూచించారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వసీంకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News