Saturday, March 29, 2025

అప్పులతో మేం ప్రజల కష్టాలు తీర్చాం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే, దేశచరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన మీరా మాపై అభాండాలు మోపేది?, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కెటిఆర్ బహిరంగ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బిజెపి ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం -కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70 వేల కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

అలాగే బిఆర్‌ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్‌కు అప్పజెప్పామని కెటిఆర్ తేల్చిచెప్పారు. అసలు అప్పులను, మిగులు బడ్జెట్‌తో ముడిపెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందని గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం సరైంది కాదని స్పష్టం చేశారు. తెచ్చిన అప్పులను దేనికోసం ఖర్చుపెట్టారనేదే అత్యంత కీలకమైన విషయమని అన్నారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పదేళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో దశాబ్దాలపాటు ఈ నేలను పట్టి పీడించిన తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు.

కేంద్ర లాగా అప్పులతో కార్పొరేట్ శక్తుల లోన్లు మాఫీ చేయలేదు

బిఆర్‌ఎస్ హయాంలో.. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితికి లోబడి చేసిన అప్పును తప్పుగా చూపించే ప్రయత్నాన్ని కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం లాగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల లోన్లు మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలని కోరారు. పంటల దిగుబడిలో పంజాబ్‌నే తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం.. తెచ్చిన అప్పులతో సంపద సృష్టించే బృహత్తర కార్యక్రమాలు చేపట్టడమేనని కుండబద్దలు కొట్టారు. అటు కేంద్ర బడ్జెట్‌లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో బిజెపి సవతి ప్రేమ కనబరుస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఏడు మండలాలను, లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతుకోసిన విషయాన్ని పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు.

కేంద్రం ఇచ్చే బహుమానం ఈ అవమానాలేనా?

బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో.. కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు తెలంగాణకు మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా అని కెటిఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో పసుపు బోర్డుకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా, కేవలం మాటలకే పరిమితం కా వడం అత్యంత దారుణమని మండిపడ్డారు. 2014లో బి జెపి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన ఐటిఐఆ ర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని పదులసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం వినిపించుకోలేదని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ అప్పులపై బురదజల్లి తప్పించుకోలేరు

బిఆర్‌ఎస్ ప్రభుత్వం సొంత ఖర్చులతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వందశాతం ఇళ్లకు మంచినీళ్లిచ్చే తెలంగాణను తీర్చిదిద్దితే, దాన్ని కూడా జల్ జీవన్ మిషన్ కిం ద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందని కెటిఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించి యువతకు ఉ పాధి కల్పించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రం వినిపిం చుకోకపోవడం ఆ ప్రాంత ప్రజల పట్ల బిజెపికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News