Friday, September 20, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ప‌రామ‌ర్శించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Condolence to Minister Srinivas Goud

హైద‌రాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ప‌రామ‌ర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ(78) గత శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయ‌న త‌ల్లి శాంత‌మ్మ చిత్ర‌ప‌టానికి మంత్రి కెటిఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కెటిఆర్ ధైర్యం చెప్పి, ఓదార్చారు.

KTR Condolence to Minister Srinivas Goud

KTR Condolence to Minister Srinivas Goud

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News