Friday, March 14, 2025

ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు…రాష్ట్ర సంపద పెంచడం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా..? అని ఎక్స్ వేదికగా సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లెవా..? అని అడిగారు. అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలం.. ..సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం..? అని మండిపడ్డారు. లేనిది ఆదాయం కాదు… నీ మెదడలో విషయం అని సిఎం ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టేచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు.

పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థికరంగాన్ని చిందరవందర చేశారని, తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నారని పేర్కొన్నారు. ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఆశా, అంగన్‌వాడీలలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా..? అని ప్రశ్నించారు. ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు సహకరించడం లేదనడం, వారిని దారుణంగా అవమానించడమే,వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. పరిపాలన రాక పెంట కుప్ప చేసి.. ఉద్యోగాలు పనిచేస్తలేరని నిందలేస్తే సహించం అని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News