Thursday, October 17, 2024

కాంగ్రెస్ పాలనలో అందరూ బాధపడుతున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి లోపభూయిష్ట విధానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతినిధులతో కెటిఆర్ సమావేశం అయ్యారు. పరీక్షలు రాస్తామో.. రాయలేమోనన్న బాధలో విద్యార్థులు ఉన్నారని అన్నారు.

నవంబర్‌ 5న ధర్నా చేస్తున్నామని ఆటో డ్రైవర్లు వచ్చి చెప్పారని, కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారని కొంతమంది వచ్చి ఫిర్యాదు చేశారని.. ఈ ప్రభుత్వ విధానాలతో రైతులు, యువకులు అందరూ బాధపడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News