Saturday, June 29, 2024

చొప్పదండి ఎంఎల్‌ఎ మేడిపల్లి సత్యంకు కెటిఆర్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎంఎల్‌ఎ మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పరామర్శించారు. బుధవారం ఆల్వాల్‌లోని ఎంఎల్‌ఏ మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకొని ఆయన సతీమణి రూపదేవి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేడిపల్లి సత్యంను ఓదార్చి ధైర్యం చెప్పారు. కెటిఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎంఎల్‌ఎ వివేక్, హుజురాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి, ఎంఎల్‌సి శంభిపూర్ రాజు,మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News