మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 480 మంది రైతులు అత్మహత్యలకు పాల్పడ్డారని, వేసవి సమయంలో నీటి ఎద్దడి నివారణపై చర్య లు చేపట్టకుండా అందాల పోటీలు నిర్వహిస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్సయిజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లిని ప్రశ్నించారు. ఫా ర్ములా ఈ కార్ రేస్ ద్వారా రూ. 700కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.46 కోట్ల ఖర్చు చేస్తే రాద్ధాంతం చేసి రేస్ నిర్వహణ జరగకుండా చే శారని, ఇప్పడు రూ.54 కోట్లతో మిస్ వరల్డ్ పోటీలు ఎలా నిర్వహిస్తార ని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా ఆదాయం ఎలా వస్తుందో, కొలువులు ఎలా వస్తాయో పర్యాటక శాఖ మంత్రి వివరించాలన్నారు. ఇ దే మంత్రి, బిఆర్ఎస్ హయంలో ప ర్యాటక మంత్రిగా ఉన్నారని అన్నా రు.
అంబేద్కర్ విగ్రహనికి ఎప్రిల్ 14 నుంచి అయినా పర్యటకులు ఆహ్వానించాలన్నారు. అమరవీరుల జ్యోతి ని పర్యాటక ప్రాంతంగా వినియోగించుకోవచ్చన్నారు. బిఆర్ఎస్ హయం లో రామప్పకు యూనిస్కో గుర్తింపు వచ్చిందని ఆ దిశగా కేంద్రానికి లేఖ రాసి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. పర్యాటక అభివృద్ధి చేపడుతున్నామ న్న రంగనాయక సాగర్, పోచంపా డు, మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భా గంగా నిర్మించినవేనని గుర్తు చేశా రు. మేము ఓఆర్ఆర్ టీవోటీ పద్దతి లో 33 సంవత్సారా లీజ్ కు ఇస్తే ప్ర శ్నించిన వారు, ఇప్పుడు పర్యాటక శాఖకు చెందిన భూములను 99 సంవత్సారాల లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.