Wednesday, April 2, 2025

కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తారా..?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తారా..? అని నిలదీశారు. ఆయన పుట్టిన రోజున హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు కడితే చించేస్తారా..? అని మండిపడ్డారు. సిఎం రేవంత్‌రెడ్డికి ఐఎఎస్, ఐపిఎస్‌లు అంటే గౌరవం లేదు..సహచర మంత్రుల మీద నమ్మకం లేదని ఆరోపించారు. సిగ్గు సిగ్గు…అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా..? అని సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు..పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చు.. ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచొచ్చు..అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చు..ఆయనకు పాఠశాల విద్యార్థులను నడిఎండలో నిలబెట్టి పూలుచల్లి స్వాగతం పలకొచ్చు, వారితో ఆయనకు అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించవచ్చు..ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్‌ను వెనక్కు నెట్టి వేదికను పంచుకోవచ్చా..? అని నిలదీశారు. పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు..ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణికి ఎస్కార్ట్ సదుపాయం కల్పించచ్చా..? అని అడిగారు.

పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది : కెటిఆర్
ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు అని కెటిఆర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని పేర్కొన్నారు. మీరు బ్యాగులతో దొరికారని..అందరూ మీ లాగానే బ్లాక్‌మెయిల్ దందాలు చేస్తారని సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తూ బ్రతుకుతున్నారని అనుకోవడం తప్పు అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News