Wednesday, April 2, 2025

నవీన్ కుటుంబానికి మంత్రి కెటిఆర్ హామీ

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల ః  సిరిసిల్ల బివైనగర్‌కు చెందిన అవివాహిత యువకుడు చిటికెన కిరణ్ (28) శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా నవీన్ కుటుంబాన్ని ఆదుకుంటామని, అధైర్యపడవద్దని మంత్రి కెటిఆర్ శనివారం ఉదయం హమీ ఇచ్చారు. నవీన్ తండ్రి నాగభూషణంతో మంత్రి కెటిఆర్ ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు.

నవీన్ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమన్నారు.నాగభూషణంను అధైర్యపడవద్దని భరోసా నిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల మున్సిపల్ పాలక వర్గ సభ్యులకు మంత్రి కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News