Sunday, February 2, 2025

అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా చేశారు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఏడాది పాలనలోనే ఆకలిచావులు, ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ మార్చేసిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. పదేళ్ల పాలనతో తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నిలబెడితే దాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఏడాదిలోనే అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణ మార్చేశారని కెటిఆర్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని, కాంగ్రెస్ దెబ్బకు వారు విలవిల్లాడుతున్నారని ఆరోపించారు. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, తెచ్చిన అప్పులు చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్టుబడిదారుల ఉసురు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి రైతుల్లో కెసిఆర్ ఆత్మవిశ్వాసం నింపారని, వ్యవసాయ రంగానికి ఆయన వెన్నెముకగా నిలిచారని పేర్కొన్నారు. ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదు..ప్రజలను వేధించే పాలన…జాగో తెలంగాణ జాగో అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News