Thursday, September 19, 2024

మెండీస్ సెంచరీ… ఐదో వికెట్ కోల్పోయిన లంక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంక 42 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 296 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుశాల్ మెండీస్ సెంచరీతో చెలరేగిపోయాడు. పథుమ్ నిశాంక, సమర్‌విక్రమా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మెండీస్ 77 బంతుల్లో 122 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో ఇమామ్ అల్ హక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కుశాల్ పెరీరా పరుగులేమీ చేయకుండా హసన్ అలీ బౌలింగ్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో మైదానం వీడాడు. నిశాంక 51 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో షఫికు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. చరితా అశలంకా ఒక పరుగు చేసి హసన్ బౌలింగ్‌లో రిజ్వాన్ క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ధనుంజయ్ ది సిల్వా 25 పరుగులు చేసి మహ్మాద్ నవాజ్ బౌలింగ్‌లో షహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో దసున్ శనకా (01), సదీరా సమరావిక్రమా(86) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News