Monday, October 7, 2024

లాలూ కుటుంబానికి చెందిన రూ. 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన ఆరుకోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. ఈ కేసులో 2022 లో లాలూపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. లాలూతోపాటు ఆయన భార్య, కూతుళ్లు, మీసా భారతి, హేమా యాదవ్‌లపై ఈ కేసు నమోదైంది. రైల్వేలో ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబం భారీ స్థాయిలో భూముల్ని తక్కువ ధరకే కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మేలు చేసేందుకు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న

లాలూ ప్రసాద్ యాదవ్ తన పదవిని దుర్వినియోగం చేసినట్టు సిబిఐ తన దర్యాప్తులో పేర్కొంది. ఎటువంటి నియామక ప్రక్రియ చేపట్టకుండా బీహార్‌కు చెందిన యువతకు గ్రూపు డీ పోస్టుల్ని కేటాయించినట్టు లాలూపై సీబీఐ రిపోర్టు ఇచ్చింది. ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్ జోన్లలో బీహారీలకు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. లక్ష చదరపు గజాల స్థలాన్ని కేవలం 26 లక్షలకే లాలూ కుటుంబం సొంతం చేసుకున్నట్టు సిబిఐ ఆరోపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News