Saturday, July 6, 2024

టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జూన్ 24 నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. నేడు  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సిఎం చంద్రబాబు టిడిపి పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పార్టీ పార్లమెంటరీ నేతను ఎంపిక చేశారు. ఇక, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బైరెడ్డి శబరి, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను చంద్రబాబు నియమించారు. లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ విప్ గా హరీశ్ బాలయోగిని నియమించారు.

ఆంధ్రప్రదేశ్ లో  మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా, ఇటీవలి ఎన్నికల్లో టిడిపి 16 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. ఎన్డీయేతో పొత్తు నేపథ్యంలో, ఇద్దరు టిడిపి ఎంపీలు కేంద్ర క్యాబినెట్లో చోటు సంపాదించారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రిగా నియమితులు కాగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల కేంద్ర సహాయమంత్రిగా నియమితులయ్యారు.

2019  ఎన్నికల్లో వైసిపి తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు 2024 ఎన్నికల ముందు టిడిపిలో చేరారు. సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేసి వైసిపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై ఘనవిజయం సాధించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News