Thursday, March 27, 2025

రోడ్డెక్కిన న్యాయవాదులు..రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

- Advertisement -
- Advertisement -

న్యాయవాదులు రోడ్డెక్కారు… న్యాయవాది ఇజ్రాయిల్ హత్యపై నిరసనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళనలు కొనసాగగా, హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఆందోళన చేస్తున్న న్యాయవాదులను గన్ పార్క్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొది. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, తమ రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. . నిరసన కారులను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. చంపాపేట్ పరిధిలోని న్యూ మారుతి నగర్‌కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశారు.

దీంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఇజ్రాయెల్ ను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు దస్తగిరి లోంగిపోయాడు. ఇక, మృతుడు నివాసం ఉంటున్న పై ఫ్లాట్ లో ఎలక్ట్రిషియన్ దస్తగిరి మహిళను వేధింపులకు గురి చేస్తుండగా ఆ వేదింపులు భరించలేక ఆ మహిళ న్యాయవాది ఇజ్రాయెల్ ను ఆశ్రయించింది. మహిళతో కలిసి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎలక్ట్రిషియన్ దస్తగిరిపై న్యాయవాది ఇజ్రాయెల్ ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ కక్ష కట్టిన నిందితుడు కత్తితో దాడి చేసి చంపేశాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు అరెస్ట్ చేయగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

న్యాయవాది హత్యను ఖండించిన లాయర్స్ అసోసియేషన్
హైదరాబాదుకు చెందిన న్యాయవాది ఇజ్రాయిల్ తన సొంత ఇంటికి వెళుతుండగా సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దస్తగిరి అనే వ్యక్తి దారుణంగా పొడిచి చంపడని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ అన్నారు. ఇటీవల దేశంలో, రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న వరుస ఘటనలు న్యాయవాదులలో అభద్రతా భావాన్ని పెంపొందించుతున్నాయని, ప్రజల హక్కులు, ఆస్తుల కోసం కృషి చేసే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతే గుండాయిజం రౌడీయిజం రాజ్యమేలుతుందని, అది ఈ దేశానికి నష్టదాయకమని ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ముద్దాయిని ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ నిర్వహించి శిక్షించాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం అమలు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News