Sunday, April 13, 2025

ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

నగరంలోని ఎల్బీ నగర్ కోర్టులో ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన జలపల్లిలోని ఇంటి వివాదం కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో గతంలో మోహన్‌బాబుకు అనుకూలంగా తీర్పు లభించినప్పటికీ, తాజాగా ఎల్బీ నగర్ కోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఈ నిర్ణయంతో ఈ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. జలపల్లిలోని ఒక ఇంటికి సంబంధించిన ఆస్తి తగాదా విషయం లో మోహన్ బాబు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు మోహన్ బాబు వాదనలను అంగీకరించి, ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఈ వ్యవహారంలో కొత్త సాక్ష్యాలు, ఆధారాలు బయటకు రావడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మోహన్ బాబు తరపున కేసు వాదిస్తున్న వారికి వ్యతిరేకంగా, న్యాయవాది మనోజ్ కొన్ని కీలక ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా మోహన్ బాబు తరపు న్యాయవాదులు వ్యవహరించారని, దీనికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించారని మనోజ్ వాదించారు. ఈ ఆధారాలను పరిశీలించిన ఎల్బీ నగర్ కోర్టు, గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలనకు తీసుకుంది. ఈ కేసుపై మంగళవారం జరిగిన విచారణలో ఎల్బీ నగర్ కోర్టు గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కోర్టుకు సమర్పించిన కొత్త ఆధారాలు, సాక్ష్యాలు ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఈ తీర్పుతో మోహన్‌బాబుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, తప్పిదానికి పాల్పడిన ఒక కోర్ట్ క్లర్క్‌పై ఎల్బీ నగర్ కోర్టు చర్యలు తీసుకుంది. కేసు వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం లేదా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం వంటి అంశాలపై ఆ క్లర్క్‌కు మెమో జారీ చేసినట్లు తెలిసింది. మోహన్‌బాబు తరపు న్యాయవాదులు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉన్నత కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నా రు. అదే సమయంలో మనోజ్ తరపు వారు కేసును మరింత బలోపేతం చేసేందుకు అదనపు ఆధారాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News