Wednesday, October 16, 2024

సల్మాన్ ఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెబితే వదిలేస్తాం: బిష్ణోయ్ గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

ముంబై:  బాబా సిద్ధిఖీ హత్య తర్వాత నటుడు సల్మాన్ ఖాన్ కు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు ముంబై పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఒక్కటే మార్గమని బిష్ణోయ్ వర్గం హెచ్చరించినట్లు తెలుస్తోంది. 1999లో  విడుదలైన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ కోసం 1998లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడాడు. ఈ కేసులో కింది కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. దీనిని ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దాంతో వారికి బెయిల్ వచ్చింది. బిష్ణోయ్ వర్గానికి ‘కృష్ణజింక’ దైవంతో సమానం. తాము పూజించే కృష్ణజింకను సల్మాన్ వేటాడి చంపాడని, అతడిని ఎలాగైనా చంపేస్తామని ఇదివరకే బిష్ణోయ్ వర్గం ప్రకటించింది. ఇదివరకే సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ మేరకు బిష్ణోయ్ కమ్యూనిటీ అఖిల భారత అధ్యక్షుడు దేవేంద్ర బుధియా ఓ ప్రకటన చేశారు.

సల్మాన్ ఖాన్ తరపున సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ క్షమాపణలు చెప్పడంతో ఈ విషయంపై దేవేంద్ర బుధియా స్పందించాడు.  “సల్మాన్ ఖాన్  క్షమాపణ చెబితే బిష్ణోయ్ సంఘం దానిని పరిగణనలోకి తీసుకుంటుంది. సోమి అలీ ఎలాంటి తప్పు చేయలేదు. అందువలన ఆమె క్షమాపణ అంగీకరించలేము. సల్మాన్ గుడికి రావాలి. ఆ తర్వాత అతడు స్వయంగా క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాత అతడికి విధించే శిక్ష గురించి ఆలోచిస్తాం” అని అన్నాడని సమాచారం.

లారెన్స్ బిష్ణోయ్ 2018లో కోర్టుకు హాజరైన సందర్భంగా ఇలా అన్నాడు: “మేము సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్‌లో చంపుతాము. మేము చర్య తీసుకుంటే అందరికీ తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, వారు కారణం లేకుండా నాపై నేరారోపణలు చేస్తున్నారు.”

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News