Sunday, September 8, 2024

కొత్త పన్ను విధానం శ్లాబుల్లో మార్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు ఈ యూనియన్ బడ్జెట్ లో. దీని ప్రకారం రూ. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ. 3 లక్ష ల నుంచి రూ. 7 లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు. రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం పన్ను విధిస్తారు. రూ. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం, రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం,  రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వారికి 30 శాతం పన్ను పడనున్నది. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల  నుంచి రూ. 75 వేలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News