Friday, September 20, 2024

నదిలో పడిపోయిన లారీ: ఐదుగురు కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

Lorry falls into river Five workers killed

బెటుల్(మధ్యప్రదేశ్): ఇనుప చువ్వలతో వెళుతున్న ఒక లారీ బెటుల్ జిల్లాలోని తవా నది వంతెనపై నుంచి పడిపోయి లారీ డ్రైవర్‌తోసహా ఐదుగురు కార్మికులు మరణించారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని కతి గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వంతెనపైన పిట్టగోడను ఢీకొన్న లారీ అదుపుతప్పి నదిలో పడిపోయినట్లు పోలీసులు చెప్పారు. ట్రక్కులో చిక్కుకుపోయిన కార్మికుల మృతదేహాలను క్రేన్ సాయంతో వెలికితీశారు. మృతులంతా బెటుల్ జిల్లాలోని పిప్రి గ్రామానికి చెందినవారని అధికారులు చెప్పారు.

Lorry falls into river Five workers killed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News