Sunday, February 23, 2025

టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీగౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ టీపిసిసి ప్రచార కమిటీ నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ ని  నియమించినట్లు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కో చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్‌గా సయ్యద్ అజమతుల్లా హుస్సేనీ నియమించినట్లు తెలిపారు. వీరితో పాటు 21 మందికి కార్యవర్గ కమిటీ సభ్యులుగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News