Sunday, October 6, 2024

ఆర్‌టిసి బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి

- Advertisement -
- Advertisement -
హైదరాబాద్: ఆర్‌టిసి బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గుపల్లికి చెందిన అన్నదమ్ములు మొగులయ్య (44), లక్ష్మయ్య(32) పొలం పనులు ముగించుకొని ఆదివారం సాయంత్రం బైక్ పై బయలుదేరారు. పారుపల్లి సమీపంలో మహబూబ్ నగర్ నుంచి కోయిలకొండకు వస్తున్న ఆర్‌టిసి బస్సు వచ్చి బైక్ ను ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News