Saturday, April 26, 2025

పురుగుమందు తాగి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ గ్రామానికి చెందిన నేల్లి కనకయ్య (56) పురుగుమందు తాగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు తెలిపిన వివరాల ప్రకారం నేల్లి కనకయ్య కూలీ పని చేసుకొని జీవిస్తుండేది.

తనకు ఉన్న 30 భూమిని తన కూతురుకు కట్నం కింద ఇచ్చి వివాహం చేసారు.వివాహసమయంలో 2లక్షల వరకు అప్పు కాగా,3 సంవత్సరాల నుండి పని చేయగా పోవడం,అప్పుభారం పెరుగడంతో బతుకుపై విరక్తి చెందిన శనివారం వ్యవసాయ బావి వద్దకు వెల్లి పురుగుమందు తాగి కిందపడి కొట్టుకొగా తాటికొండ తిరుపతి చూసి కుటుంబసభ్యులకు తెలుపగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందారు ,మృతిని కూమారుడు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకునట్లు సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News