Sunday, February 23, 2025

అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సోమాజిగూడలోని శీయమాన్షన్ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి గణపతి(35) అనే కార్మికుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి సంబంధించిన కారణాల గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. కార్మికుడి మృతికి గల కారణాల గురించి తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News