Sunday, October 27, 2024

దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

- Advertisement -
- Advertisement -

ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిన దారుణ సంఘటన యాదాద్రి భువనగిరిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన రమేశ్‌కుమార్ భార్య నిహారిక, నిఖిల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో భువనగిరి ప్రాంతంలో ప్రియుడితో కలిసి తన భర్త రమేశ్ కుమార్ ను హత్య చేసింది భార్య.

అనంతరం శవాన్ని కర్ణాటకకు తీసుకెళ్లిన భార్య నిహారిక, ప్రియుడు నిఖిల్.. అక్కడ ఓ కాఫీ ఎస్టేట్‌లో మృతదేహానికి నిప్పు పెట్టారు. అయితే, కాఫీ తోటలో కాలిన మృతదేహాన్ని గుర్తించిన కర్ణాటక పోలీసులు..కేసు చేధించారు. రూ.8కోట్ల ఆస్తి కోసమే భర్తను హత్య చేసినట్లు తేల్చారు. హత్యకు సహకరించిన మరో నిందితుడు రాణాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News