Tuesday, September 17, 2024

30 ఏండ్ల పోరాటానికి దక్కిన ఫలితం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : 30 ఏండ్ల పోరాటానికి ఫలితం దక్కిందని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పానన్నారు. అధర్మం తాత్కాలికమైనదని వెల్లడించారు. వర్గీకరణ చేసే అ ధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చె ప్పిందన్నారు. ఎస్‌సి వర్గీకరణపై సిజెఐ చం ద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 6:1 తేడాతో తీర్పువెలువరించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం కోసమే 30 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని చె ప్పారు. ఉద్యమాలను దెబ్బతీసే కుట్రలు ఎన్నో జరిగాయని విమర్శించారు. అ యినా సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పో రాడామన్నారు.

న్యాయం కోసం ఎంఆర్‌పిఎస్‌కు అండగా నిలిచిన వారందరికీ ఈ విజయం అంకితం ఇస్తున్నామన్నారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు కూడా సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని చెప్పారు. వర్గీకరణ కోసం ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారని చెప్పారు. అనుకూల తీర్పునిచ్చిన జడ్జీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానని గుర్తుచేశారు. త్వరలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతామని మంద కృష్ణ మాదిగ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News