Friday, October 18, 2024

నామినేషన్ వేసిన మేనక గాంధీ

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనకగాంధీ బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కృతిక జోత్సకు ఆమె తన నామినేషన్ పత్రాలు అందించారు. ఆ తరువాత కార్యాలయం వెలుపల మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మేనక గాంధీ సమాధానం చెప్పారు. అమేథీ, రాయిబరేలీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించక పోవడంపై స్పందించాలని కోరగా, ఆ స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థుల పేర్లు ఎప్పుడు ప్రకటిస్తుందో తనకు తెలియదన్నారు.

ఆయా స్థానాలకు నామినేషన్ గడువు మే 3 తో ముగియనుందని గుర్తు చేశారు. సుల్తాన్‌పూర్ నుంచి మరోసారి గెలిపిస్తే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రజలకు మరిన్ని ఇళ్లు నిర్మింప చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎంపీగా గతంలో కష్టపడిన దానికి కంటే మరింత కష్టపడి పని చేస్తానని చెప్పారు. నామినేషన్ సమయంలో మేనక వెంట నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్, అప్నాదళ్ నాయకుడు , కేంద్ర మంత్రి అషిష్ పటేల్ ఉన్నారు.

బీజేపీ మళ్లీ అధికారం లోకి రావడం కోసం రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకు వస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. అలాగే కుమారుడు వరుణ్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలుస్తారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పిలిబిత్ లోక్‌సభ స్థానాన్ని వరుణ్ గాంధీకి బీజేపీ కేటాయించక పోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News