Tuesday, September 17, 2024

మణిపూర్‌లో మళ్లీ అల్లరి మూకల విధ్వంసం.. ఇళ్లు, బస్సులకు నిప్పు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో అల్లరి మూకల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మోరే జిల్లా లోని మోరే బజార్ ప్రాంతంలో కొందరు దుండగులు పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. అయితే ఆ ఇళ్లలో ఎవరూ నివాసం ఉండట్లేదని తెలిసింది. ఈ ప్రదేశం మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు రవాణా కోసం వినియోగించే రెండు బస్సులను సైతం ఇలాగే ముష్కరులు తగుల బెట్టారు.

సపోర్మీనా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మణిపూర్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ బస్సులు దిమాపుర్ వైపు నుంచి వస్తుండగా, స్థానికులు వాటిని అడ్డుకున్నారు. బస్సుల్లోకి ఎక్కి, ఇతర తెగ ప్రజలెవరైనా అందులో ఉన్నారా అని సోదాలు చేశారు. ఆ తరువాత వాటిని దహనం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మణిపూర్‌లో మూడు నెలల నుంచి మైతేయ్, కుకీ జాతుల మధ్య రగులుతున్న ఘర్షణల ఫలితంగా వివిధ అల్లర్లలో సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News