Tuesday, September 17, 2024

మన్మోహన్‌సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నది: ఎయిమ్స్ వైద్యులు

- Advertisement -
- Advertisement -

Manmohan Singh

 

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, చికిత్సకు స్పందిస్తున్నారని సోమవారం ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం మన్మోహన్‌సింగ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు జ్వరం రావడానికి కారణాలను అర్థం చేసుకోవడానికి నిపుణులైన డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎయిమ్స్ డాక్టర్ల పర్యవేక్షణలో మన్మోహన్ క్షేమంగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. 2009లో సింగ్‌కు ఎయిమ్స్‌లోనే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతయైన మన్మోహన్‌సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News