Friday, April 25, 2025

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వట్‌పల్లి: మండల పరిధిలోని షాద్‌నగర్(గట్‌పల్లి)లో తెలుగానం శ్రీలత (21) భర్త రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని వట్‌పల్లి ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చేందిన సిరుర్ రవిని గత సంవత్సరం ప్రేమించి వివాహం చేసుకుంది. అత్తింటి వారి వరకట్న వేధింపులు తాళలేక మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. అనంతరం ఆమెను నిమ్స్ దవాఖానకు తరలించి వైద్యం అందించిన గురువారం ఉదయం మరణించింది. మృతిరాలి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News