- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం సెలవుదినంతోపాటు శ్రీరామనవమి కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చేస్తున్నారు.
ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది. ఇక, శనివారం శ్రీవారిని 78,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.06 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -