Sunday, April 20, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. నిండిపోయిన కంపార్టుమెంట్లు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం వీకెండ్ కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో టిబిసి క్యూలైన్‌ వరకు వేచి భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 24 గంటల వరకు సమయం పడుతుంది.

ఇక, శుక్రవారం తిరుమల వెంకన్నను 58,519 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,360 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.27 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News