Tuesday, September 17, 2024

కాకినాడ ఓడరేవులో ముఖ్యమైన సన్నివేశాలు

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భారీ బడ్జెట్ మూవీ ‘మట్కా’తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ని డిఫరెంట్ లుక్స్‌లో చూపించిన ఫస్ట్‌లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ ముఖ్యమైన షెడ్యూల్‌లో టీమ్ టాకీ పార్ట్, ప్రముఖ తారాగణంతో కూడిన యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ చేతిలో తుపాకీతో కాకినాడ ఓడరేవులో క్రూయిజ్‌షిప్ ముందు నిలబడి కనిపించారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News