Friday, March 29, 2024

మ్యాట్రిమోని అడ్డాగా.. మోసాలు

- Advertisement -
- Advertisement -

Matrimonial Frauds Rise in India

 వివాహం చేసుకుంటానని
నకిలీ ప్రొఫైల్స్‌తో మోసం
ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.1.67కోట్లు
వసూలు చేసిన నిందితురాలు
గతంలో నైజీరియన్ ముఠా మోసాలు

హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్ సైట్ల ను అడ్డాగా చేసుకుని పలువురు మోసాలు తెరలేపుతున్నారు. గతంలో నైజీరియన్ ముఠాలు వైద్యులుగా ప ని చేస్తున్నామని చెప్పి పలువురు యువతుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారు. ఇప్పుడు నగరానికి చెందిన మహిళ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఎన్‌ఆర్‌ఐలే.. లక్షంగా చేసుకుని మోసం చేయడంతో కటకటాల పాలైంది. తాను బాగా ఆస్తిపరులమని చెప్పి ఇద్దరు ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.1.67 కోట్లను వసూలు చేసి మోసం చేసింది. మ్యాట్రీమోనీలో నకిలీ ప్రొఫైల్ ను క్రియేట్ చేసి పలువురిని మోసం చేసింది. తన ఆస్థి న్యాయస్థానం వివాదంలో ఉందని ఆస్తి తన చేతికి రా గానే మళ్లీ డబ్బులు ఇస్తానని చెప్పి ఇద్దరు యువకుల నుంచి డబ్బులు వసూలు చేసింది.

ఈ విధంగా ఇద్దరు యువకుల నుంచి రూ.1.67కోట్లు వసూలు చేసింది. డబ్బులు ఆమె బ్యాంక్ ఖాతాకు వచ్చిన తర్వాత ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి స్పందించడం మానివేస్తోంది. జూబ్లీహిల్స్‌కు చెందిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడ ంతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి కు టుంబ సభ్యుల సహకారం ఉండడంతో భర్త, అత్తా ప రారయ్యారు. ఆమెకు సహకరిస్తున్న కుమారుడిని అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా ఇ లాగే మోసం చేయడంతో పోలీసులు ఆమె భర్త, అత్తను అరెస్టు చేశారు. అయినా కూడా వారి ప్రవర్తనలో మా ర్పు రాలేదు. మరో విధంగా మోసం చేయడం ప్రారంభించారు. పలువురు యువతీ, యువకులు వివాహం కోసం మ్యాట్రీమోని సైట్లలో తమ ప్రొఫైల్స్‌ను అప్‌లో డ్ చేస్తున్నారు. వీటిని పరిశీలిస్తున్న నేరస్థులు నకిలీ స మాచారం ఇచ్చి వారిని మోసం చేస్తున్నారు.

ఇండియా కు అక్రమంగా వచ్చి ఇక్కడే ఉంటున్న నైజీరియన్లు కూ డా ఇదే విధంగా పలువురు మహిళలను మోసం చేసి డబ్బులు వసూలు చేశారు. షాదీడాట్.కామ్, భారత్‌మ్యాట్రిమోని తదితర వివాహ వెబ్‌సైట్లలో ఉన్న వివరా లు తీసుకుని వారిని సంప్రదిస్తున్నారు. మాటల్లో పెట్టి నమ్మిన తర్వాత తమ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. మొబైల్ నెంబర్ తీసుకుని తాను వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పి నకిలీ ప్రొఫైల్స్ పెట్టి వారిని మోసం చే స్తున్నారు. ఈ విధంగా కొద్ది రోజులు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్న తర్వాత వివాహం చేసుకుంటానని చెబుతున్నారు. ఇది నమ్మి పలువురు బాధితులు వారి మాటలు నమ్మి మోసపోతున్నారు. తాను విదేశాల్లో వై ద్యుడిగా పనిచేస్తున్నానని, ఇండియాకు వచ్చిన తర్వా త వివాహం చేసుకుంటానని చెబుతున్నారు.

కొద్ది రో జుల తర్వాత డాలర్లు, బంగారు ఆభరణాలు, ఆపిల్ వస్తువులు పంపిస్తున్నానని చెబుతున్నారు. కొరియర్ ద్వారా వస్తువులు పంపిస్తున్నానని చెబుతున్నారు. ఒక టి రెండు రోజుల తర్వాత కొరియర్ నుంచి ఫోన్ చేసినట్లు వేరే వారితో మాట్లాడిస్తున్నారు. మీకు కొరియర్ వచ్చిందని, కస్టమ్స్, జిఎస్‌టి తదితర ట్యాక్స్‌లు చెల్లించాలని వాటి కింద డబ్బులు చెల్లించాలని చెప్పడంతో బాధితులు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి కస్టమ్స్ క్లియరెన్స్ డబ్బులు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తే వస్తువులు పంపిస్తామని చెప్పడంతో డబ్బులు పంపిస్తున్నారు. ఇలా ప లు కారణాలు చెప్పి దశల వారీగా డబ్బులు తీసుకుంటున్నారు. చివరికి తాను మోసపోయానని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

వైద్యుల పేరుతో మోసం…

వివాహం చేసుకుంటానని చెబుతూ మోసం చేస్తున్న నైజీరియన్లు ఎక్కువగా వైద్యుడిగా పనిచేస్తున్నానని బాధితులను మోసం చేస్తున్నారు. వైద్య వృత్తికి మంచి ఆ దరణ ఉండడంతో సులభంగా నమ్మి మోసపోతున్నా రు. అంతేకాకుండా నైజీరియన్లు ఇంగ్లీష్ బాగా వచ్చిన వారితో చాటింగ్ చేయిస్తున్నారు. కూకట్‌పల్లికి చెందిన వైద్యురాలు భర్త నుంచి విడాకులు తీసుకుని వేరే ఉం టోంది. రెండో వివాహం చేసుకుందామని భారత్‌మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో తన వివరాలు పొందుపర్చింది. వాటిని చూసిని నైజీరియన్ ముఠా ఆమెకు ఖరీదైన వ స్తువులు పంపిస్తున్నానని చెప్పి రెండు దఫాలుగా రూ. 12,45,000 వసూలు చేశాడు. బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వా రి గుట్టు రట్టయింది.

నైజీరియాకు చెందిన అబెల్ ఓడా రా ఇండియాకు విజిటింగ్ వీసాపై వచ్చి ఉత్తర్‌ప్రదేశ్ లో ఉంటున్నాడు. షాదీ.కామ్‌లో డాక్టర్ ఆయూష్ త్యా గిగా ప్రొఫైల్ అప్‌లోడ్ చేసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ మహిళతో ఛాటింగ్ చేశాడు. తాను లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నానని, తనకు కూతు రు ఉందని, భార్య కారు ప్రమాదంలో మృతిచెందింద ని తెలిపాడు. తను ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. కొద్ది రోజుల తర్వాత ఓ నెంబర్ నుంచి బాధితురాలికి ఫోన్ వచ్చింది. తన పేరు పూజ అని కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని చెప్పింది. ఆయూష్ త్యాగి తమ కస్టడీలో ఉన్నాడని రూ.3 కోట్లు చెల్లిస్తే విడుదల చేస్తామని చెప్పారు. ఇది నిజమని న మ్మిన బాధితురాలు వివిధ బ్యాంకుల ద్వారా రూ.5, 45,100 డిపాజిట్ చేసింది. కొద్ది రోజుల తర్వాత తా ను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. ఇలా పలువురిని వివాహం చేసుకుంటానని చెప్పి నైజీరియాకు చెందిన సైబర్ నేరస్థులు మోసం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News