Sunday, October 6, 2024

గండిమైసమ్మ చౌరస్తాలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తాలో ఖాళీ ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు దుండిగల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి చెట్టుకు ఉరేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News