ప్రముఖ నిర్మాత, టిఎస్ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, నిర్మాత హర్షిత్ రెడ్డి కలిసి ఇటీవల హైదరాబాద్లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ బృందం లో డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు. భారత్, -ఆస్ట్రేలియా మధ్య, ముఖ్యంగా సినిమా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను ఎలా మరి ంత పటిష్టం చేసుకోవాలనే దానిపై ఈ సమావేశం లో ప్రధానంగా చర్చించారు. ఇరు దేశాల మధ్య సి నిమా సహ నిర్మాణాలు, సాంస్కృతిక కార్యక్రమా లు, నటీనటులు, సాంకేతిక నిపుణుల మారకము వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంపైనా, తెలుగు సినిమాపైనా ఆస్ట్రేలియా ప్రతినిధులు ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపించారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సృజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడుతుందని, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్రాజు భేటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -