Thursday, April 24, 2025

అనంత్ నాగ్ నుంచి పోటీచేయనున్న మెహబూబా ముఫ్తీ

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: లోక్ సభ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్ నాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పిడిపి ఆదివారం తమ అభ్యర్థులను మూడు సీట్లకు ప్రకటించినప్పుడు ఆమె పోటీ చేసే స్థానాన్ని స్పష్టం చేసింది.  కాగా వహీద్ పర్రా శ్రీనగర్ నుంచి, రాజ్యసభ సభ్యుడు మీర్ ఫయాజ్ బారాముల్లా నుంచి పోటీ చేయనున్నారని పిడిపి పార్లమెంటరీ బోర్డ్ చీఫ్ సర్తాజ్ మదని తెలిపారు. ముఫ్తీ, మదనీ సంభాషించిన విలేకరుల సమావేశం లో పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఉధంపూర్, జమ్మూ స్థానాలలో పిడిపి, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News