Sunday, February 23, 2025

ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి ఘన విజయం సాధించారు

- Advertisement -
- Advertisement -
Vikram Reddy
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజంగఢ్, రామ్ పూర్, పంజాబ్ లోని సంగ్రూర్ మూడు లోక్ సభ స్థానాలకు, ఢిల్లీలోని రాజిందర్ నగర్, జార్ఖండ్‌లోని మందర్, ఆంధ్రాలో ఆత్మకూర్,  అగర్తల, టౌన్ బోర్దోవాలి, త్రిపురలోని సుర్మా, జబరాజ్‌నగర్  ఏడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

అగర్తల, చండీగఢ్, హైదరాబాద్, లక్నో, న్యూఢిల్లీ, రాంచీ: ఆదివారం జరిగిన ఢిల్లీలోని రాజిందర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 11,000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా, త్రిపుర సిఎం మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి ఉపఎన్నికల్లో 6,104 ఓట్ల తేడాతో గెలుపొందారు, తన సమీప ప్రత్యర్థి మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై విజయం సాధించారు. మాణిక్ సాహా సీఎంగా కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News