Tuesday, July 2, 2024

కంటోన్మెంట్ వాసుల కల సాకారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ క టోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాల ను జిహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్ర భుత్వంఆమోదం తెలిపింది.అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జిహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మో డీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు.ఈనేపథ్యం లో బ్రిటీష్ కాలం నుంచిఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెం ట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చే యాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరు తూ రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి ఇటీవలె కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశా రు.

ఈనెల 25 కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తీ సుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ అందుకు సంబంధించిన విధి వి ధానాలపై లేఖ రాశారు. దీని ప్రకారం కంటోన్మెంట్ లోని సివిల్ ఏరియాలను జిహెచ్‌ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉ చితంగా జిహెచ్‌ఎంసీకి బదిలీ చేస్తారు.కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అ ప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇ చ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మిన హా కంటోన్మెంట్ లోని నివాస ప్రాంతాలకు జిహెచ్‌ఎంసీ పరిధి విస్తరిస్తుంది.

తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తుంది. కేంద్ర ప్రభు త్వం పేరి ట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు, సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టంచేసింది.కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అను గుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్‌బోర్డు బాధ్యులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News