- Advertisement -
చెన్నై: ఐపిఎల్లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం జరిగే రెండో మ్యాచ్లో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్లు తలపడనున్నాయి. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఐపిఎల్లో ఐదేసి టైటిల్స్తో టోర్నమెంట్పై తమదైన ముద్ర వేసిన ఈ జట్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై టీమ్కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని చేసే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగే ఛాన్స్ ఉంది.
- Advertisement -