Friday, September 27, 2024

కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా?:కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి. కాని మీరు, మీ ప్రభుత్వం కూల్చివేత తో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. హైడ్రా పేరుతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని, నగరంలో నిర్మాణాలకు ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి, ఇప్పుడు అక్రమం అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇలా ఏకపక్షంగా ప్రజల ఇళ్లను కూలగొడితే, పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలని కిషన్ రెడ్డి తన లేఖలో సిఎంను నిలదీశారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ అధికారులు ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతోందన్నారు. గత ప్రభుత్వాలు పేదల కోసం అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశాయని గుర్తు చేశారు. హైడ్రా అధికారులు, ప్రభుత్వం కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలని, ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News