ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండి శాటిలైట్ టౌన్ షిప్
నిర్మాణాలకు హౌసింగ్ శాఖ ప్రాధాన్యం ఇవ్వాలి ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి
ఇండ్ల నిర్మాణంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం
డిజిటల్ భూ సర్వేకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి
హౌసింగ్, రెవెన్యూ, సమాచారశాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై జరిగిన
సమావేశంలో డిప్యూటి సీఎం భట్టి పాల్గొన్న మంత్రులు పొంగులేటి
శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వ ర్తించని ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జి ల్లా ల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని డి ప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. సచివాలయంలో శనివారం రెవిన్యూ, హౌసింగ్, సమాచారశా ఖ ఉన్నత అధికారులతో 2025–26 బడ్జెట్ ప్రతిపాదనల పై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి సమీక్షించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పే దలకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాడానికి ఈ ఏడాది ప్ర తి నియోజక వర్గానికి 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్లో ని ధులు కేటాయించిందని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జి ల్లా ఉమ్మడి మహబూబ్నగర్
జిల్లాలో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమని అన్నారు. వివాదాల కారణంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిపి, ఏజీపీలతో ప్రభుత్వ భూవివాద కేసులకు సంబంధించి నిరంతరం మానిటరింగ్ చేయాలన్నారు. కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి దక్కే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. సినిమా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా లఘు చిత్రాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచనలను, ప్రభుత్వ పథకాలను లఘు చిత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహనగరం శరవేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ఆవుటర్, రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ పేద, మధ్యతరగతి ప్రజల కోసం శాట్ లైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి ఇండ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, అవసరమైన భూమి కోసం రెవెన్యూ శాఖ ప్రతిపాదనలను పంపించాలన్నారు. గత ప్రభుత్వాలు ఎస్ఆర్ నగర్, బర్కత్పూర, కూకట్పల్లి, ఈసిఐఎల్ లాంటి ప్రాంతాల్లో హౌజింగ్ బోర్డు ఆధ్వ్య్రంలో ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి పేరిట ఇండ్ల నిర్మాణాలు చేయడం వల్ల ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేరిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిజిటల్ భూ సర్వేకు సంబంధించి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల జాబితాను సేకరించి, ప్రతి నెల అద్దె చెల్లించడానికి ఆర్థిక శాఖలో
ప్రత్యేకంగా ఒక సెక్షన్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. కాలుష్యం లేనటు వంటి గ్రీన్ ఎనర్జీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంపద్ సృష్టించి ఆ సంపదను ఈ రాష్ట్ర ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్షమన్నారు. ఈ లక్షానికి అనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, రెవిన్యూ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ ఎండి గౌతమ్. సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.