Sunday, September 8, 2024

విద్యార్థులకు చెక్కులు, ల్యాప్‌టాప్స్ అందజేత

- Advertisement -
- Advertisement -

Minister Koppula Eshwar congratulated students of SC Gurukul

జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి కొప్పులఈశ్వర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : అన్ని వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించారు- షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో జరిగిన కార్యక్రమంలో వంద మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఎస్సీ గురుకులాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఎంబిబిఎస్, బిడిఎస్, ఐఐటి,ఎన్‌ఐటిలలో సీట్లు పొందిన విద్యార్థినీ,విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సాహాక బహుమతులు అందజేశారు. 2018,-19,-20 విద్యా సంవత్సరాలలో ఐఐటి, ఎంబిబిఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన వారికి 50 వేలు, ఎన్‌ఐటి, బిడిఎస్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు 40 వేల చొప్పున మంత్రి చెక్కులు అందజేశారు. ఐఐటి విద్యను అభ్యసిస్తున్న వారికి ల్యాప్‌టాప్స్ పంపిణీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహాకంగా రూ.92 లక్షల 40 వేలు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను భారీసంఖ్యలో ప్రారంభించినట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో ఉచితంగా విద్యను అందిస్తున్నామన్నారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసీ, మైనారిటీ, జనరల్ గురుకుల విద్యా సంస్థల ద్వారా 981 స్కూళ్లలో 5 లక్షల 40 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి కార్పొరేట్ స్థాయిలో విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, పుస్తకాలు,యూనిఫారంలు,బూట్లు అందిస్తున్నామన్నారు. లా, ఫైన్ ఆర్ట్,ఫిల్మ్ మేకింగ్,సైనిక్ స్కూల్, బాలికలకు డిగ్రీ కాలేజీలను నిర్వహిస్తున్నాం. మన గురుకుల విద్యార్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఫలితాలతో పాటు జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నారని ప్రశంసించారు.

ఈ సంవత్సరం 240 మంది విద్యార్థులు ఎంబిబిఎస్, బిడిఎస్‌లో 30 మంది సీట్లు పొందనున్నారని వెల్లడించారు. ఐఐటిలో- 84 మంది, ఎన్‌ఐటిలో- 62 మంది ,సెంట్రల్ యూనివర్సిటీలలో- 27 మంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో -22 మంది సీట్లు సాధించారని, క్రీడల్లో చక్కని ప్రతిభ కనబర్చుతున్నారని అభినందించారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్, విద్యా సంస్థల సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంత్‌నాయక్, సంయుక్త కార్యదర్శులు శారద, ప్రవీణ్, కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Minister Koppula Eshwar congratulated students of SC Gurukul

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News