నారాయణపేట: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. కృష్ణ జలాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసియు వార్డును ప్రారంభించారు. కెసిఆర్ నాయకత్వంలో ఎపితోనే కాదు.. అవసరమైతే దేవుడితోనూ కొట్లాడతామని తేల్చిచెప్పారు. ఎవరు అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్న మంత్రి కెటిఆర్ ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అములు అవుతున్నాయని పేర్కొన్నారు.నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పురపాలక శాఖ మంత్రి @KTRTRS#PattanaPragathi pic.twitter.com/7UCVYG5Kyb
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 10, 2021