Saturday, February 22, 2025

అక్కడ కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థులను పెట్టింది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వారు అక్కడ దీక్ష దివస్ జరుపుకోని, ఎక్కడి వారు అక్కడ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రుల్లో రోగులకు సేవలు, పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామరక్ష అన్నారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థులను పెట్టిందని కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అస్త్రసన్యాసం చేశారన్నారు. ఐటి దాడులు కేవలం కాంగ్రెస్ నేతలపైనే జరుగుతున్నాయనటం అవాస్తవం అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News