Sunday, September 8, 2024

దోపిడీకి కాళేశ్వరం బలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం పునరుద్ధ్దరణపై సాంకేతిక నిపుణుల కమిటీ సూచనలు సలహాలమేరకే ముందుకు వెళతామని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం డ్యామ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధ్దరణ అంశంపై సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు రాష్ట్ర నీటిపారుదల శాఖు చెందని ఉన్నతస్థాయి అధికారులు డ్యామ్‌సేఫ్టి అథారిటీ నియమించిన కమిటీలోని నిపుణు లు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం నాడు మరో దఫాగా నీటిపారుదల ఉన్నతస్థాయి అధికారుల స్థాయిలోనే సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కెటిఆర్‌ల ఉచిత సలహాలు అక్కర్లేదన్నారు.

కాళేశ్వరంతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదని, కానీ మొత్తం తెలంగాణకు నీ ళ్లు అందించామంటూ కెసిఆర్, కెటిఆర్ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టుకు సంబంధించి జియాలాజికల్ నిపుణుల సూచనలు తీసుకోకుండా, ఏ టెస్టులు చేయకుండానే బ్యారేజీలు ఎలా కట్టారని ప్రశ్నించారు. ఏ బ్యారేజీలో కూడా 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజి పెట్టరని చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర తమ ప్రభుత్వం ప్రాజెక్టు కట్టి తీరుతుందని స్పష్టం చేశారు. ప్ర స్తుతం ఉన్న కాళేశ్వరం అలాగే ఉంటుందని గ్రావిటీతో నీటిని తీసుకొచ్చేలా ప్రాజెక్టు రూపొందిస్తామని తెలిపారు. నిర్మాణ పనులు చేసి న కాంట్రాక్టర్లతోనే మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజిల రిపేర్ పనులు చేయిస్తున్నామని, ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని తేల్చిచెప్పా రు. బ్యారేజిల గేట్లు పాడవడానికి కారణం ఎవరో కేటీఆర్ సమాధా నం చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరంపై కేటీఆర్ అబద్ధాలు చెప్పడానికి బుద్ధి ఉండాలని విమర్శించారు.

అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని తెలిపారు ఐదేళ్లలో సుమారు 65 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని చెప్పారు. సంవత్సరానికి 13 టీఎంసీలు మాత్రమే విని యోగించుకున్నారని, ప్రచారం కోసమే కాళేశ్వరాన్ని కేసీఆర్ వాడుకున్నారని అన్నారు. తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ ఖర్చు చాలావరకు తగ్గేదని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంపులు పనిచేస్తే ఈ ప్రాజెక్టు నిర్వహణ కింద ఏడాదికి రూ.10 వేల కోట్లు విద్యుత్ ఛార్జీలకే సరిపోతుందని వివరించారు. వడ్డీలు రూ.10 వేల కోట్లు, విద్యుత్ ఖర్చు మరో రూ.10 వేల కోట్లు అవుతుందని చెప్పారు. కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టు, వాళ్ల హయంలోనే కూలిందని విమర్శించారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజి ఆరు అడుగులు భూమిలోకి కుంగిపోయిందని వెల్లడించారు.కేసీఆర్ సిఎంగా ఉండి ఈ ఘటనపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని,

40 రోజులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అమూల్యమైన లక్షకోట్ల ప్రజాధనం వృథా చేశారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ నేతలు ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చినప్పటికీ, తాము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకే అప్పగించినట్లు తెలిపారు. వారి సూచనల మేరకు నడుచుకుంటామని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడ్డ డ్యామ్‌సేఫ్టీ అథారిటీని అధ్యయనం చేయాలని కోరినట్టు తెలిపారు.ఇప్పటివరకు జరిగిన టెస్టులు, పనులు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై డ్యామ్ సేఫ్టీ అధికారులతో చర్చలు జరిపామని అన్నారు. డ్యామ్ సేఫ్టీ సూచనలను చాలా వరకు అమలు చేశామని తెలిపారు. మరోసారి సోమవారం భేటీ అవుతున్నామని చెప్పారు.

బ్యారేజిల ద్వారా నీటివిడుదల :
మూడు బ్యారేజీల్లోని గేట్లను ఎత్తి గోదావరి వరద నీటిని కిందకు వదిలేయాలని లిఖితపూర్వకంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని ఆ పనులు జరుగుతున్నాయని వివరించారు. అబద్దాలు చెప్పడానికి కేటీఆర్‌కి కూడా ఒక హద్దు ఉండాలని విమర్శించారు. బిఆర్‌ఎస్ దోపిడీ విధానాలతోనే లోపాలు జరిగాయని అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని ఉత్తమ్ మండిపడ్డారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారని, వారి హయాంలోనే కూలిందని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అధికారులకు కెటిఆర్ కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉందని భావిస్తున్నామని తెలిపారు. నాశనం చేసిన వారే సలహాలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఉచిత సలహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. సాంకేతిక కమిటీ నిపుణుల సలహాల మేరకే ముందుకు వెళ్తామని అన్నారు. తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News