Tuesday, September 10, 2024

గుత్తేదారుదే బాధ్యత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అం దించే ఉద్దేశంతో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌వాల్ పడిపోయినందున, జరిగిన నష్టాన్ని సంబంధిత కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డితో కలిసి సుంకిశాలను శుక్రవారం సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చే సిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మం త్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌వాల్ పడిపోయిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువ అయినప్పటికీ ఈ సంఘటన జరగడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. దీని వ ల్ల పనులు మరో

రెండు నెలలు ఆలస్యం అవుతాయని, ఎలాంటి నష్టం జరిగినా కాంట్రాక్టర్ భరిస్తారని స్పష్టం చేశారు. సుంకిశాల ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలోనే ఉందని, పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి అప్పగిస్తారని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల వ్యవధిలో ఎస్‌ఎల్‌బిసి పూర్తి చేసి ఉంటే హైదరాబాద్ నగరానికి తాగునీటితోపాటు, నల్గొండకు సాగునీటికి అన్నింటికీ ఉపయోగకరంగా ఉండేదని అన్నారు. గత ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చినంత ప్రాధాన్యత దక్షిణ తెలంగాణ, నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఎస్‌ఎల్‌బిసి, డిండి ప్రాజెక్టులను పూర్తిచేసి తీరుతామని అన్నారు. ఈ ప్రాంత సాగు నీటి ప్రాజక్టుల విషయమై రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి వెళ్లిన సమయంలో, అలాగే వర్షాభావ పరిస్థితులు, వేసవికాలంలో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఇతర మార్గాల ద్వారా తాగునీరు అందిస్తున్నప్పటికీ నాగార్జునసాగర్ ప్రాజక్ట్ డెడ్ స్టోరేజీ సమయంలో తాగునీటి కోసం దీని నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. ఉమ్మడి నల్గొండ సాగునీటితో పాటు, తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో గతంలో ఎస్‌ఎల్‌బిసిని చేపట్టారని, అయితే ఎస్‌ఎల్‌బిసి నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ఇతర మార్గాల ద్వారా ఆయా ప్రాజెక్టుల ద్వారా తాగునీరు, సాగునీరు అందుతున్నదని వెల్లడించారు. 2014 నుండి 2022 వరకు సుంకిశాల ప్రాజెక్టు పనులు జరగలేదని, 2022 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టుపై 875 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు.

భారీ వరద కారణంగా, వరద ఒత్తిడి వల్ల ప్రాజెక్టు సైడ్ వాల్ ప్రమాదం సంభవించిందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ..ఇదివరకు నల్గొండ జిల్లా కరువు పీడిత ప్రాంతమే కాకుండా, ఫ్లోరైడ్ మహమ్మారి పీడిత జిల్లా అని, తాగడానికి సైతం సరిగా నీరు దొరికేది కాదని అన్నారు. అలాంటి పరిస్థితులలో ఎస్‌ఎల్‌బిసి ద్వారా తాగునీటిని, ఉమ్మడి నల్గొండకు 4 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఇవ్వాలని ప్రభుత్వం ఎస్‌ఎల్‌బిసి చేపట్టిందని తెలిపారు. ఇది ఆసియా ఖండంలోనే ఎత్తయిన సొరంగం ప్రాజెక్టు అని తెలిపారు. ప్రస్తుతం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్‌కి తాగునీరు వస్తున్నదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం పడిపోయిన సందర్భంలో సుంకిశాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చేందుకు ప్రతిపాదించారని తెలిపారు. అయితే సుంకిశాల ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని ఏజన్సీ ఊహించకపోవడం, త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్న ఆత్రుతతో వల్ల ప్రాజెక్టు సైడ్‌వాల్ కూలిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు.

సైడ్‌వాల్ కూలిపోయిన సంఘటన ప్రభుత్వం దృష్టికి రాలేదని, పత్రికలు, మాధ్యమాలలో వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే కమిటీ వేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కమిటీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సైడ్ వాల్ కూలిపోవడం వల్ల కలిగే నష్టం నేరుగా ప్రభుత్వంపై పడకున్నా రానున్న వేసవికాలంలోనే సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటిని ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంఘటన చిన్నదే అయినప్పటికీ వరద వస్తుందన్న అంచనా లేకపోవడం, తొందరపాటు తన వల్లనే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రాష్ట్ర జలమండలి అధికారి అశోక్ రెడ్డి, జలమండలి డైరెక్టర్ సుదర్శన్, సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవార్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సిఈ నాగేశ్వరరావు, సుంకిశాల ప్రాజెక్టు ఏజెన్సీ సిజిఎం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News