Sunday, September 8, 2024

ప్రధాని మోడీపై మంత్రి వేముల ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి రాజు ప్రధాని మోడీ అని మంత్రి వేముల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖ జాతరల్లో ఒక్కటైనా మేడారం జాతరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని వారు ఈరోజు వరంగల్ వచ్చి మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇది ట్రైలర్ అని బెదిరించేవారు ప్రధాని అవుతారా అని మంత్రి వేముల ప్రశ్నించారు. దేశంలో బిజెపి మత రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. బిజెపి ఇచ్చిన హామీలన్ని నిలబెట్టుకోవాలంటే మరో 50 ఏళ్లు పడుతోందని మంత్రి వేముల ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News