Sunday, February 23, 2025

మహిళకు మంత్రి వేముల భరోసా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన ఎస్. తనుశ్రీ కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స కొరకు 2లక్షల రూపాయల ఎల్‌ఓసిని మంజూరు చేయించి, ఎల్‌ఓసి కాపీని కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. కిడ్నీ చికిత్స కొరకు రూ.2 లక్షల ఎల్‌ఓసిని మంత్రి మంజూరు చేశారని, ఆయన మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News