Monday, March 17, 2025

బిసి గురుకులాల్లో ప్రవేశ పరీక్ష ద్వారా 6,832 బ్యాగ్ లాగ్ సీట్లు భర్తీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా బిసి గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీకి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఇందుకు ఈ నెల 31 లోగా ఆన్ లైన్ లో www.mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.6, 7, 8, 9వ తరగతుల్లో (ఇంగ్లీష్ మీడియం) మొత్తం 6,832 బ్యాగ్ లాగ్ సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష లో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ప్రవేశ పరీక్షకు అర్హతగల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కార్యదర్శి సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News